ఏపీలో మరో 2 కరోనా మరణాలు.. 500 దాటిన కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా AP Coronavirus Positive Cases మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Apr 15, 2020, 02:33 PM IST
ఏపీలో మరో 2 కరోనా మరణాలు.. 500 దాటిన కేసులు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడించింది.   మొన్న బార్బర్‌.. నిన్న కమెడియన్‌గా నటి!

రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో పశ్చిమ గోదావరిలో 8, కర్నూల్‌లో 6, గుంటూరులో 4, కృష్ణ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 502 పాజిటివ్ కేసులకు గాను 16 మంది డిశ్చార్జ్ కాగా, 11 మంది మరణించారు (అనంతపురం 2, కృష్ణా 3, గుంటూరు 4, కర్నూల్ 1,నెల్లూరు 1). ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 475.  ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు

Image Credit: twitter/@ArogyaAndhra

కాగా, అత్యధికంగా 118 కరోనా కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. కర్నూల్ 97, నెల్లూరులో 56, కృష్ణాలో, ప్రకాశంలో 42, కడపలో 33 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News