ఏపీలో తాజాగా 68 కరోనా కేసులు, ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కరోనా మరణాలు సైతం పెరిగిపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Last Updated : May 20, 2020, 11:25 AM IST
ఏపీలో తాజాగా 68 కరోనా కేసులు, ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407కు చేరింది. తాజాగా కర్నూల్ జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. ఏపీలో ఇప్పటివరకూ 53 మంది కరోనాతో మరణించారు.  నేడే రానా, మిహికాల నిశ్చితార్థం

రాష్ట్రంలో నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసులకుగాను 1639 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 53 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715. నిన్న ఒక్కరోజు 43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News