Chandrababu Naidu Case: చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్

Chandrababu Naidu Arrest in AP Skill Development Scam: అమరావతి: ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2023, 05:43 AM IST
Chandrababu Naidu Case: చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్

Chandrababu Naidu Arrest in AP Skill Development Scam: అమరావతి: ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులో మా వాదన వినాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి అని ఆరోపించిన ఏపీ సర్కారు.. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి కనుకే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశామని ఏపీ సర్కారు సుప్రీం కోర్టుకు వెల్లడించింది.

ప్రైవేటు సంస్థ కోసం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం వెచ్చించాల్సిన ప్రజా ధనాన్ని ఎన్‌క్యాష్‌ చేసుకున్నట్టు తగిన ఆధారాలు ఉన్నాయి అని ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికితీసుకువెళ్లింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి అని తమ పిటిషన్ లో పేర్కొన్న ఏపీ సర్కారు.. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖనే అని స్పష్టంచేసింది. ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతామని.. అందుకోసం తమకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని వేడుకుంది.

ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆయన తరఫున లాయర్‌ సిద్దార్థ లూథ్రా క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీజే.. చంద్రబాబు పిటిషన్‌పై మంగళవారం ఏదో ఒక బెంచ్‌ విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో, పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు కేసు సుప్రీం కోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

జస్టిస్‌ సరస వెంకట నారాయణ భట్టి మన తెలుగు వారే. 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్‌ భట్టి.. 2023 జులై 14 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అత్యున్నత వ్యక్తులు ఇన్‌వాల్వ్ అయిన కేసు కాబట్టే ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని జస్టిస్‌ భట్టి ప్రకటించారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంతో ఏకీభవించిన జస్టిస్ ఖన్నా.. వారి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.

Trending News