AP Corona cases: ఏపీలో ఆగని కరోనా కల్లోలం- ఒక్క రోజులో 9 మంది మృతి!

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13,618 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 08:01 PM IST
  • రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్​ ఉగ్ర రూపం
  • లక్ష దాటిన యాక్టివ్​ కేసుల సంఖ్య
  • గుంటూరులో అత్యధిక యాక్టివ్​ కేసులు
AP Corona cases: ఏపీలో ఆగని కరోనా కల్లోలం- ఒక్క రోజులో 9 మంది మృతి!

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13,618 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది.

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 49,143 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,687 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,101,685 మంది కరోనాను జయించారు.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది.

విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, శ్రీకాకులం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,570 మంది కొవిడ్​కు బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,06,318 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 15,677 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత గుంటూరులో 10,167 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 2,771 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో నాలుగు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,22,83,369 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,222,573  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

Also read: Padma Shri: పద్మ శ్రీ ప్రకటనపై గరికిపాటి నరసింహారావు ఆనందం!

Also read: AP New Districts Details: ఏపీ 26 కొత్త జిల్లాల స్వరూపం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News