క్రైస్తవులకు "చంద్రబాబు" వరాలివే

క్రిస్మస్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులపై వరాల జల్లు కురిపించారు.

Last Updated : Dec 25, 2017, 08:55 PM IST
క్రైస్తవులకు "చంద్రబాబు" వరాలివే

క్రిస్మస్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులపై వరాల జల్లు కురిపించారు. "‪పండుగలు డబ్బున్న వారే కాదు పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుక ఇస్తున్నాము. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా కానీ ఈ ఏడాది నాకు మరింత స్ఫూర్తి లభించింది. ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. నవ్యాంధ్రలో మత సామరస్యం కాపాడటమే కాదు పేదలందరి సంక్షేమ బాధ్యత నేను తీసుకుంటున్నాను" అని చంద్రబాబు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ సందేశం ఇచ్చారు. 
 

ఈ సందర్భంగా ఏపీలో క్రైస్తవుల సంక్షేమం కోసం చంద్రబాబు ఇచ్చిన వరాలివే
1. ఫిరంగిపురంలో వందేళ్ల నాటి చర్చిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు
2.2017-18 బడ్జెట్లో క్రైస్తవుల అభ్యున్నతికి రూ.72 కోట్లు కేటాయించారని.. వచ్చే ఏడాది దానిని రెట్టింపు చేస్తామని తెలిపారు
3. ప్రార్థనా మందిరాలు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ఇస్తామన్నారు

 

Trending News