కేసీఆర్-జగన్ ల కుట్రలో భాగమే ఐటీ గ్రిడ్ పై కేసు - చంద్రబాబు

                                

Last Updated : Mar 4, 2019, 01:18 PM IST
కేసీఆర్-జగన్ ల కుట్రలో భాగమే ఐటీ గ్రిడ్ పై కేసు - చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ సంస్థ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పై కేసు నమోదు అవడంతో ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. డేటా చోరీ పేరుతో తమ వారిపై కేసు నమోదు చేయడంపై ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులు అంటూ బెదిరిస్తున్నారు...మరోవైపు టీడీపీ దెబ్బతీసేందుకు తమ వారిపై దాడి చేస్తూ కేసీఆర్ బెదిరిస్తున్నారు..అందుకు జగన్ సహకరిస్తున్నారని దయ్యబట్టారు. ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తి లేదని  స్పష్టం చేసిన చంద్రబాబు... ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు

డేటా చోరీ చేశారనే ఆరోపణపై ఐటీ గ్రిడ్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏపీ అడ్వొకేట్ జనరల్, డీజీపీతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్ కేసు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుకావడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు

Trending News