Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన

Vizag steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి విన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అధికారపార్టీ నిరసిస్తూ..ధర్నా చేపట్టింది. పార్టీలకతీతంగా పోరాడేందుకు పిలుపునిచ్చింది.

Last Updated : Feb 10, 2021, 01:35 PM IST
Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన

Vizag steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి విన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అధికారపార్టీ నిరసిస్తూ..ధర్నా చేపట్టింది. పార్టీలకతీతంగా పోరాడేందుకు పిలుపునిచ్చింది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag steel plant privatisation)ను రాష్ట్ర ప్రభుత్వం (Ap government) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రధాని మోదీకు ఈ విషయమై లేఖ రాశారు. క్యాప్టివ్ మైన్స్( Captive mines )కేటాయిస్తే తిరిగి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లో వస్తుందని వివరించారు. ప్రైవేటీకరణ వద్దని..విశాఖపట్నం ఉక్కు అనేది తెలుగు ప్రజల భావోద్వేగానికి కూడా సంబంధించిందని చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటికే పార్టీలకతీతంగా పోరాడేందుకు వైసీపీ (Ysrcp) పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్ రాజు తదితరులు హాజరయ్యారు. అటు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు ఉక్కు ఉద్యమంపై చర్చించారు. చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై సమీక్షించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని..రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai reddy ) తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదట్నించి తాము చెబుతున్నామని..ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకు గనులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని సమితి తెలిపింది. 

Also read: Ys Sharmila party: ఆరంభమే కాలేదు..అన్ని పార్టీలు ఆగమాగమవుతున్నాయంటే అర్ధమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News