ప్రత్యేక హోదా కోసం యువకుడు ఆత్మహత్య

ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ఆత్మహత్య

Last Updated : Aug 31, 2018, 07:01 PM IST
ప్రత్యేక హోదా కోసం యువకుడు ఆత్మహత్య

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ జిల్లాలోని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద సెల్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన త్రినాధ్ (28) ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు  పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గతనెలలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా మదనపల్లి రామారావుకాలనీలో సుధాకర్‌ (29) అనే యువకుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Trending News