ఏపీ సీఎం చంద్రబాబుకి బీజేపీ ఎమ్మెల్సీ సవాల్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగ సవాల్ విసిరారు.

Last Updated : Feb 5, 2018, 06:58 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుకి బీజేపీ ఎమ్మెల్సీ సవాల్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుని తెంచుకోవాలని భావిస్తున్నారా అనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఏపీకి నరేంద్ర మోదీ సర్కార్ ఏమీ చేయలేదని, కేంద్ర బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం అదే స్థాయిలో ఘాటైన జవాబులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగ సవాల్ విసిరారు. ఒకప్పుడు కేవలం 2 ఎకరాలు మాత్రమే వున్న చంద్రబాబు నాయుడు ఇవాళ కోట్లకు ఎలా పడగలెత్తాడో బహిరంగ చర్చావేదికలో జవాబు చెప్పాలని చంద్రబాబు నాయుడుని ఛాలెంజ్ చేశారు సోము వీర్రాజు. తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అధికారాన్ని అడ్డంపెట్టుకుని తన గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 

ఓవైపు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అధికారంలో వున్న టీడీపీ నేతలు మాత్రం కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆయన.. 'ముందుగా టీడీపీ అధినేత, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడటం మాని ప్రజలకు ఏదేనా మేలు చేకూర్చే పనులు చేయాలి' అని సోము వీర్రాజు అధికార పార్టీ నేతలకు హితవు పలికారు.

Trending News