Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌ బహిరంగ లేఖ.. ఏం రాశారంటే..?

Minister Nara Lokesh Letter: త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రిలీజ్ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 29, 2024, 11:06 AM IST
Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌ బహిరంగ లేఖ.. ఏం రాశారంటే..?

Minister Nara Lokesh Letter: డిసెంబ‌ర్ 7న నిర్వ‌హించ‌బోయే త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా స‌మావేశాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్ర‌జాప్ర‌తినిధులు, దాత‌లు, పూర్వ‌విద్యార్థులు, స్వ‌చ్చంద సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తూ ఆయన లేఖ రిలీజ్ చేశారు. "పాఠ‌శాల విద్యావ్య‌వ‌స్థ‌కే అతి పెద్ద పండుగ‌గా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబ‌ర్ 7వ తేదీన నిర్వ‌హించ‌నున్న త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల స‌మావేశం (PTM)లో పాల్గొని విజ‌య‌వంతం చేస్తార‌ని కోరుతున్నాను. ఈ స‌మావేశం పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి, విద్యార్థి వికాసానికి, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఓ ఆత్మీయ వార‌ధిని నిర్మిస్తుంది. 

Add Zee News as a Preferred Source

ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంప‌వ‌ర్ ల‌క్ష్యాల‌తో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర‌మంతా ఒకేసారి డిసెంబ‌ర్ 7న విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశం పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం. 

ఇందులో వార్డు స‌భ్యుల నుంచి పార్ల‌మెంటు స‌భ్యుల వ‌ర‌కూ.. స‌ర్పంచ్ నుంచి ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ రాజ‌కీయాల‌కు అతీతంగా..అంతా ఒకే పాఠ‌శాల‌లో కాకుండా, వారి వారి గ్రామాల పాఠ‌శాల‌ల్లో జ‌రిగే మెగా పేరెంట్-టీచ‌ర్ మీటింగ్‌లో పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. 

ఈ స‌మావేశం ద్వారా పిల్ల‌ల చ‌దువు, ప్ర‌వ‌ర్త‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ త‌ల్లిదండ్రులు తెలుసుకోవ‌చ్చు. పిల్ల‌ల స‌మ‌స్య‌లు, అభ్య‌స‌నా సామ‌ర్థ్యాలు, క్రీడలు, క‌ళ‌లు ప‌ట్ల ఆస‌క్తులను టీచ‌ర్ ముందుంచి వారిని మ‌రింత‌గా ఆయా అంశాల్లో ప‌రిణ‌తి సాధించేలా ప్రోత్స‌హించ‌వ‌చ్చు. 

 విద్యావ్య‌వ‌స్థ‌ను రాజ‌కీయాలకు దూరంగా ఉంచ‌డం.. విద్య నేర్చుకునే పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను పాఠ‌శాల‌ల‌కు ద‌గ్గ‌ర చేయ‌డం అనేది మ‌న ప్ర‌భుత్వం ల‌క్ష్యం. పేరెంట్- టీచ‌ర్ మీటింగుకి హాజ‌ర‌య్యే ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా.. మీ పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకుని రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. 

పాఠ‌శాల‌ల‌కు విరాళాలు ఇచ్చిన దాత‌లు,  పాఠ‌శాల‌ల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే పూర్వ‌విద్యార్థులు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు కూడా డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌బోయే మెగా పేరెంట్-టీచ‌ర్ మీటింగ్ లో భాగం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతూ అంద‌రికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం." అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Also Read: Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

Also Read: Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News