టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల చివరి జాబితా ఇదే..

                       

Last Updated : Mar 19, 2019, 09:47 PM IST
టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల చివరి జాబితా ఇదే..

టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల చిట్ట చివరి మూడో జాబితా ను ప్రకటించింది.  మూడవ జాబితాలో  36 మంది అసెంబ్లీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో 15 మందిని ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై తీవ్ర కరసత్తు చేసిన అనంతరం మిగిలిన 36 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలోని 175 స్థానాలకు టీడీపీ తన అభ్యర్ధులను ఖారారు చేసినట్లయింది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం...

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:
 

విజయనగరం జిల్లా: నెల్లిమర్ల – పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం– అదితి గజపతిరాజు

విశాఖ జిల్లా: భీమిలి–సబ్బం హరి, గాజువాక– పల్లా శ్రీనివాసరావు, చోడవరం– కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల– గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి– బండారు సత్యనారాయణమూర్తి
 

తూర్పుగోదావరి జిల్లా: ఈ జిల్లాలో మిగిలిన ఉన్న ఒకే ఒక్క స్థానం అమలాపురం అసెంబ్లీ స్థానంలో అయితాబత్తుల ఆనందరావుకు కేటాయించింది 
 

పశ్చిమగోదావరి జిల్లా: నిడదవోలు– బూరుగుపల్లి శేషారావు, నర్సాపురం– బండారు మాధవనాయుడు, పోలవరం– బొరగం శ్రీనివాసరావు
 

గుంటూరు జిల్లా: తాడికొండ– తెనాలి శ్రావణ్‌కుమార్, బాపట్ల– అన్నం సతీష్‌ ప్రభాకర్, నరసరావుపేట– డాక్టర్‌ అరవిందబాబు, మాచర్ల – అంజిరెడ్డి
 

ప్రకాశం జిల్లా: దర్శి– కదిరి బాబూరావు, కనిగిరి–ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి
 

నెల్లూరు జిల్లా: కావలి– విష్ణువర్ధన్‌రెడ్డి,నెల్లూరు రూరల్‌– అబ్దుల్‌ అజీజ్, వెంకటగిరి– కె.రామకృష్ణ, ఉదయగిరి– బొల్లినేని రామారావు 
 

కడప జిల్లా: కడప– అమీర్‌ బాబు, కోడూరు-నర్సింహప్రసాద్, ప్రొద్దుటూరు-లింగారెడ్డి 
 

కర్నూలు జిల్లా: కర్నూలు– టీజీ భరత్, నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు– బి.రామాంజనేయులు
 

అనంతపురం జిల్లా: గుంతకల్లు– ఆర్‌.జితేంద్రగౌడ్, సింగనమల– బండారు శ్రావణి, అనంతపురం అర్బన్‌– ప్రభాకర్‌ చౌదరి, కల్యాణదుర్గం–ఉమామహేశ్వర్‌నాయుడు, కదిరి– కందికుంట వెంకట ప్రసాద్ 
 

చిత్తూరు జిల్లా: తంబళ్ల పల్లె– శంకరయాదవ్,సత్యవేడు– జేడీ రాజశేఖర్, గంగాధర నెల్లూరు– హరికృష్ణ, పూతలపట్టు– తెర్లం పూర్ణం 

Trending News