విశాఖలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన జీపు.. ఇద్దరు మృతి...

Jeep fell into valley in Vishakapatnam: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ జీపు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 05:32 PM IST
  • విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం
  • పెద్దవలస సమీపంలో లోయలో పడిపోయిన జీపు
  • ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి
విశాఖలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన జీపు.. ఇద్దరు మృతి...

Jeep fell into valley in Vishakapatnam: విశాఖ జిల్లా పెద్దవలస గ్రామ సమీపంలోని బోడువలస ఘాట్ రోడ్డులో ఓ జీపు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం (జనవరి 13) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ప్రమాద సమయంలో జీపులో మొత్తం 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. బోల్తా పడిన జీపు పెద్దవలస మీదుగా కొయ్యూరు వెళ్తోందన్నారు. ఒక్కసారిగా జీపు అదుపు తప్పడంతో నేరుగా లోయలో పడిపోయిందన్నారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక బీజేపీ నేతల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదంలో (Road Accident) మృతి చెందిన ఇద్దరిని జరతా దేవుడు, జరతా చిట్టిబాబుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విశాఖలో గతంలోనూ ఇలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.

Also Read: Viral video: అదృష్టం అంటే అతడిదే- క్షణాల్లో రెండు సార్లు చాపు తప్పింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News