జనసేన ప్రధాన కార్యదర్శిగా.. మాజీ వైసీపీ నేత

2014లో ఏలూరు నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

Last Updated : May 19, 2018, 12:40 PM IST
జనసేన ప్రధాన కార్యదర్శిగా.. మాజీ వైసీపీ నేత

2014లో ఏలూరు నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారైన తోట చంద్రశేఖర్ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా కూడా గుంటూరు లోక్ సభ స్థానం కోసం పోటీ చేశారు.

ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌లతో కలిసి ఏపీకి ఇచ్చిన నిధుల వివరాల కోసం పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీలో తోట చంద్రశేఖర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే చంద్రశేఖర్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రశేఖర్‌తో దాదాపు పదేళ్లుగా తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఆయన మంచి పరిపాలనాధ్యక్షుడే కాకుండా మంచి పారిశ్రామికవేత్త అని పవన్ కొనియాడారు.

 

Trending News