Amrit Bharat 2.0: రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్ల తయారీ ..కొత్త 12 రకాల మార్పులు: అశ్వనీ వైష్ణవ్

Amrit Bharat Trains: వచ్చే రెండేళ్లో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.తన X హ్యాండిల్‌ ద్వారా అమృత్ భారత్ 2.0 రైలు చిత్రాలను పోస్టు చేశారు. ఈ రైలులో మాడ్యులర్ టాయిలెట్ల నుండి సౌకర్యవంతమైన సీట్లు, రీడిజైన్ చేసిన అల్యూమినియం లగేజ్ రాక్‌ల వరకు సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Jan 11, 2025, 07:20 AM IST
Amrit Bharat 2.0: రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్ల తయారీ ..కొత్త 12 రకాల మార్పులు: అశ్వనీ వైష్ణవ్

Amrit Bharat 2.0 Trains: భారతీయ రైల్వేలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో కొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి.  కొన్ని పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా అలాంటి రైల్వే ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ కొత్త రైలు ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన చిత్రాలను  కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్  సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. 

 శుక్రవారం, జనవరి 10తేదీన, అశ్విని వైష్ణవ్ అమృత్ భారత్ 2.0ను పరిశీలించారు. దానికి సంబంధించిన చిత్రాలను తన X హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలతో కూడిన ఈ కొత్త రైలు ప్రత్యేకతను తన పోస్ట్‌లో తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఓ వీడియోను షేర్ చేశారు. అమృత్ భారత్ రైలు వెర్షన్ 2.0 సాధారణ పౌరుల కోసం ఆలోచనాత్మకంగా రూపొందించామని.. ఇది ప్రీమియం ఫీచర్లతో వస్తుందని తెలిపారు.

అమృత్ భారత్ 2.0 ప్రత్యేకత:

కొత్త అమృత్ భారత్ 2.0 రైలు రంగు వందే భారత్ రైలు లాగా ఉంటుంది. ఇది ఎర్గోనామిక్ హ్యాండిల్స్, రైలులో పై బెర్త్‌కు చేరుకోవడానికి మెట్లు, లగేజీ ఉంచడానికి అల్యూమినియం సామాను స్థలాన్ని కలిగి ఉంది. రైలులో మాడ్యులర్ టాయిలెట్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ బేసిన్ ఉంటుంది. 

రైలు క్యాబిన్‌లో LED లైట్లతో పాటు USB-A,  USB-C ఛార్జర్‌లు , మొబైల్ హోల్డర్‌లు కూడా అమర్చారు. ప్రయాణీకుల భద్రత కోసం రైలులో EP అసిస్ట్ బ్రేకులు కూడా ఏర్పాటు చేశారు. రైలులో "అత్యవసర సమయాల్లో ప్రయాణికులు, గార్డుల మధ్య రెండు-మార్గం కమ్యూనికేషన్" సౌకర్యం కూడా ఉంది.

 

అమృత్ భారత్ 2.0 ఫీచర్లు ఫైర్-సేఫ్ FRP ప్యానెల్స్ (HL-3 సర్టిఫైడ్), స్టెయిన్‌లెస్ స్టీల్ వాష్ బేసిన్‌తో కూడిన మాడ్యులర్ టాయిలెట్, కొరియన్ ఫినిషింగ్, లీక్ ప్రూఫ్ డిజైన్, మెరుగైన డ్రైనేజీ, పరిశుభ్రత కోసం వెంటిలేషన్  3 LED స్పాట్‌లైట్, డస్ట్‌బిన్‌తో ప్రకాశవంతంగా ఇంటీరియర్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. 

సౌకర్యవంతమైన సీటు:

అమృత్ భారత్ 2.0 లో ఎగువ బెర్త్ కోసం అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్‌లు, సుదీర్ఘ ప్రయాణాలలో ప్రయాణీకులకు సౌకర్యాన్ని అందించడానికి మందపాటి సీట్ కుషన్‌లు ఉన్నాయి. ఇది ఎర్గోనామిక్ హ్యాండిల్స్, లాకింగ్ సిస్టమ్, రీ-డిజైన్ చేసిన అల్యూమినియం లగేజ్ ర్యాక్‌ని కూడా కలిగి ఉంది.

పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకువచ్చామని..తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి మెరుగైన ప్రయాణసౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. అమ్రుత్ భారత్ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ ఓ థ్రెడ్ ను కూడా మంత్రి పోస్టు చేశారు. 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x