Flipkart mobile fest: ఫ్లిప్​కార్ట్ మంత్​ ఎండ్ మొబైల్ సేల్​.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!

Flipkart mobile fest: స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మంత్​ ఎండ్​ మొబైల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్​ ఈ రోజు, రేపు మాత్రమ అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 03:31 PM IST
  • స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ సుపర్ కూల్​ ఆఫర్లు
  • ఈరోజు, రేపు మాత్రమే అందుబాటు..
  • 5జీ మోడళ్లపై భారీ తగ్గింపు
Flipkart mobile fest: ఫ్లిప్​కార్ట్ మంత్​ ఎండ్ మొబైల్ సేల్​.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!

Flipkart mobile fest: కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారికి గుడ్​ న్యూస్​. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్లతో కూడిన మొబైల్​ సేల్​ను ప్రారంభించింది. మంత్​ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో.. ఈ సేల్​ను నేడు (మార్చి 25) అందుబాటులోకి తెచ్చింది. రేపు (మార్చి 26) వరకు ఈ సేల్ అందుబులో ఉంటుంది.

ఆఫర్​ వివరాలు..

ఫ్లిప్​కార్ట్​ వెబ్​సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. దీనితో పాటు.. అదనంగా సిటీ బ్యాంక్ కార్డ్​లతో లావాదేవీలు జరిపితే.. అదనంగా పది శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్​కార్ట్ వెల్లడించింది. ఇక రూ.30 వేలకుపైగా విలువైన ఫోన్​ను కొనుగోలు చేస్తే పది శాతం తక్షణ డిస్కౌంట్​తో పాటు.. రూ.500 అదనపు తగ్గింపు తభిస్తుందని వివరించింది కంపెనీ.

ఏ ఫోన్​పై ఎంత తగ్గింపు?

శాంసంగ్​, షియోమీ, మోటొరోలా, రియల్​మీ, వివో సహా దాదాపు అన్ని రకాల స్మార్ట్​ఫోన్లపై ఈ తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

వివో టీ1 5జీ స్మార్ట్​ ఫోన్​ ధరను రూ.14,990 దీని అసలు ధర రూ.19,990గా ఉంది.

శాంసంగ్​ ఎఫ్​ 23 5జీ స్మార్ట్​ ఫోన్​ ధరను రూ.14,999గా నిర్ణయించింది ఫ్లిప్​కారక్ట్​. దీని అసలు ధర రూ.22,999.

షీయోమీ 11ఐ హైపర్​ ఛార్జీంగ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.31,999 నుంచి రూ.21,999కు తగ్గించింది.

మోటొరోలా ప్రీమియం మోడల్​ ఎడ్జ్​ 30 ప్రోపై దాదాపు రూ.6 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీనితో రూ.55,999 ఫోన్​ ధరను రూ.49,999కే కొనుగోలు చేసే వీలుంది.

రియల్​మీ 9 5జీ ఫోన్​ ధరను రూ.18,999 నుచి రూ.11,999కు తగ్గించినట్లు ఫ్లిప్​కార్ట్ పేర్కొంది.

రెడ్​మీ 9ఐ స్పోర్ట్​ స్మార్ట్​ ఫోన్​ ధరను రూ.7,999గా ఉంచింది. దీని అసలు ధర రూ.9,999.

శాంసంగ్​ ఎఫ్​ 12 ధరను రూ.10,499గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్. దీని అసలు ధర రూ.12,999 కావడం గమనార్హం.

ఇన్ఫీనిక్స్​ జీరో 5జీ స్మార్ట్ ఫోన్ ధరను రూ.19,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందలో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్​, డైమెన్సిటీ 900 ప్రాసెస్​తో లభిస్తుంది.

శాంసంగ్​ ఎఫ్​ 12 స్మార్ట్ర్ ఫోన్ ధరను రూ.10,499గా నిర్ఱయించింది. అఫర్ లేకుండే దీని ధర రూ.12,999. ఇందులో 48 ఎంపీ రియర్​ కమెరా, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది.

రియల్​మీ సీ35లో 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా, 6.6 ఫుల్ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో కూడిన ఈ ఫోన్ ధరను రూ.9,999కు తగ్గించింది కంపెనీ. ఈ ఫోన్ అసలు ధర రూ.13,999.

ఇంకా ఇవే కాకుండా.. ఇన్ఫీనిక్స్​ నోట్​ 11, రియల్​మీ నార్జో 50ఐ, రియల్​మీ 9ఐ, రియల్​మీ 8, పొకొ సీ321, రియల్​మీ సీ11 2021 మోడళ్లపై కూడా భారీ ఆఫర్లు ఇస్తోంది.

Also read: Realme C31: రియల్​మీ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!

Also read: Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News