EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?

EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా  పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ​​ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని  EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా  చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

Written by - Bhoomi | Last Updated : Jul 28, 2024, 06:22 PM IST
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?

EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా  పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ​​ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని  EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా  చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

EPFO సభ్యులు ప్రతి నెలా వారి ప్రాథమిక జీతం,గ్రాట్యుటీలో 12శాతం PF ఖాతాలో జమ చేస్తారు.కంపెనీ కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది.ఉద్యోగి కంట్రిబ్యూట్ చేసిన మొత్తం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాకు చేరుతుంది.ఇందులో కాంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా విభజిస్తారు.ఇందులో కొంత భాగం,అంటే 8.33 శాతం,ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి వెళ్తుంది. మిగిలిన మొత్తం 3.67శాతం EPFకి వెళుతుంది.EPFO సబ్‌స్క్రైబర్‌ల తరచూ ఒక సందేహం కలుగుతుంది. పదవీ విరమణ తర్వాత EPS పథకం కింద ఎంత పెన్షన్ లభిస్తుంది?దీనికి సమాధానం ఇక్కడ తెలుసుకోవచ్చు.పెన్షన్‌ను సులభంగా లెక్కించడానికి ఇక్కడ ఒక ఫార్ములా అందుబాటులో ఉంది. 

EPS ఫార్ములా తెలుసుకునే ముందు,ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనం పొందడానికి కనీసం 10సంవత్సరాల పాటు EPSకి కాంట్రిబ్యూట్ చేయాలని తెలుసుకోవడం ముఖ్యం.అంటే మీరు 10 సంవత్సరాలు పనిచేసి,దానికి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ పథకం కింద పెన్షన్ పొందవచ్చు.గరిష్ట పెన్షన్ సేవ 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

Also Read: Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!  

EPS: పెన్షన్‌ను ఎలా లెక్కించాలి?

EPS= (పెన్షనబుల్ సర్వీస్ పీరియడ్ × పెన్షనబుల్ జీతం)/ 70

ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.ఒక ఉద్యోగి సగటు జీతం రూ.15,000 అనుకుందాం.35 ఏళ్లు పనిచేస్తే పింఛను ఎంత వస్తుందో,పైన పేర్కొన్న ఫార్ములా సహాయంతో ఇలా సులభంగా లెక్కించవచ్చు.

సూత్రం ప్రకారం,సగటు జీతం x పెన్షనబుల్ సర్వీస్ / 70 అంటే,

15000 x35 /70 =నెలకు రూ.7,500 పెన్షన్.

ఈ ఫార్ములా 15 నవంబర్ 1995 తర్వాత సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అని గమనించాలి.మునుపటి ఉద్యోగుల నియమాలు భిన్నంగా ఉంటాయి.

ఈ నియమాలను గుర్తుంచుకోవడం కూడా మంచిది:

>> 58 ఏళ్లు నిండిన ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. 

>> కానీ 'ఎర్లీ పెన్షన్' సౌకర్యాన్ని ఎంచుకోవడం ద్వారా, ఉద్యోగులు ముందుగా పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. 

>> 'ఎర్లీ పెన్షన్'లో 50 ఏళ్ల వయస్సులో పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. 

>> అయితే, 'ఎర్లీ పెన్షన్' 4% తగ్గింపుతో పెన్షన్ లభిస్తుంది.

>> అంటే 56 సంవత్సరాల వయస్సులో 'ఎర్లీ పెన్షన్' ఎంపికను ఎంచుకుంటే, ప్రాథమిక మొత్తంలో 92 శాతం మాత్రమే పెన్షన్‌గా అందుబాటులో ఉంటుంది.

>> 58 ఏళ్ల తర్వాత సాధారణ పెన్షన్ పొందవచ్చు.

Also Read : Ola Electric IPO: ఆగస్టు 2 నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎంత వరకూ పెట్టుబడి పెట్టాలి? ఎన్ని షేర్లు కొనాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x