Samsung case: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ షేర్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలింది. అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్కు జైలు శిక్ష ప్రభావం షేర్ మార్కెట్పై పడింది.
దక్షిణ కొరియా ( South korea ) లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దేశంలోని ఎలక్ట్రానిక్స్ మార్కెట్ దిగ్గజమైన శాంసంగ్ వైస్ ఛైర్మన్ ( Samsung vice chairman )కు సియోల్ హైకోర్టు ( Seoul high court ) జైలు శిక్ష విధించింది. అవినీతి, లంచం కేసులో వైస్ ఛైర్మన్ జే వై లీకు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. కంపెనీ మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్ హే సహచరుడికి లంచం ఇచ్చారన్న ( Bribe case ) ఆరోపణలపై సియోల్ హైకోర్టు విచారించి..శిక్ష విధించింది.
శాంసంగ్ వైస్ ఛైర్మన్ జే వై లీ ( Samsung vice chairman jay y lee )..దాదాపు 7.8 మిలియన్ డాలర్ల లంచం, అవినీతి, ఆదాయాన్ని దాచడం వంటి నేరాలకు పాల్పడినట్టు సియోల్ కోర్టు విశ్వసించింది. రెండున్నరేళ్ల శిక్ష తీర్పు ఇస్తూ..వారం రోజుల్లోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లవచ్చని సూచించింది. అయితే ఇప్పటికే ఇదే కేసులో సుప్రీంకోర్టు ( Supreme court ) లో తీర్పు వచ్చినందున సమీక్షించే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఇదే కేసులో 2017లోనే జే వై లీ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే తానెలాంటి నేరానికి పాల్పడలేదని..శిక్షను తగ్గించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను ఓ ఏడాదికి తగ్గించడంతో 2018 ఫిబ్రవరిలో విడుదలయ్యాడు. తరవాత సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేసి..2019లో విచారణకు ఆదేశిస్తూ సియోల్ హైకోర్టుకు తిరిగి పంపింది. ఇవాళ తాజాగా తీర్పు వెలువరించింది సియోలో కోర్టు.
అమెరికా చైనా మార్కెట్ సంబంధాల మధ్య ఏర్పడిన అనిశ్చితి కారణంగా ప్రత్యేక వ్యూహాలతో శాంసంగ్ ( Samsung ) దూసుకుపోతోంది. ఇప్పుడు లీ లేకపోతే..భారీ పెట్టుబడులు నిలిచిపోవచ్చనే ఆందోళన నెలకొంది. ఫలితంగా ఆ ప్రభావం షేర్ మార్కెట్ ( Share market )పై పడింది. శాంసంగ్ షేర్లు ( Samsung shares ) 4 శాతం పడిపోవడమే కాకుండా..శాంసంగ్ సీ అండ్ టీ, శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్ ఎస్డీఐ వంటి అనుబంధ సంస్థల షేర్లు నష్టాల్లో వెళ్లిపోయాయి.
Also read: Petrol Price Today: భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. హైదరాబాద్లో దేశంలోనే అధిక ధరలు