Anchor Anasuya : ఇన్నాళ్లు బతిమిలాడా.. ఇకపై యాక్షనే.. కేసులపై వదలనంటోన్న అనసూయ

Anasuya Bharadwaj Cyber Police  అనసూయ మీద జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యేది అనసూయ మాత్రమే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 10:36 AM IST
  • నెట్టింట్లో అనసూయ మీద ట్రోలింగ్
  • ట్రోలర్ల మీద కేసులు పెట్టిన యాంకర్
  • ఏపీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
Anchor Anasuya : ఇన్నాళ్లు బతిమిలాడా.. ఇకపై యాక్షనే.. కేసులపై వదలనంటోన్న అనసూయ

Anasuya Bharadwaj Cyber Police : అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాడిని పట్టేసుకున్నారు పోలీసులు. సినిమా తారలు, బుల్లితెర సెలెబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా వాడుతున్నాడని, ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నాడని అనసూయ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీకి చెందిన ఓ వ్యక్తిని తెలంగాణ సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ జరిగి రెండు వారాలు అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో కాస్త కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది.

ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు చేయాలనుకునే తుంటరివాళ్లలో కాస్త భయం పుట్టిందనే చెప్పుకోవచ్చు. తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు వేసిన పలు ప్రశ్నలకు అనసూయ మంచి సమాధానాలు ఇచ్చింది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టున్నావ్ అని ఓ నెటిజన్ అంటే.. తాను డబ్బు కోసమే సినిమా చేయనని, జనాలను ఎంటర్టైన్ చేసేందుకు చేస్తాను అని, కొన్ని సార్లు తన పాత్ర నచ్చకపోయినా తనకు నచ్చిన హీరోతో నటించాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తానంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక ఈ కేసుల విషయం గురించి ఓ నెటిజన్ ఇలా అడిగాడు.  ఆ పోలీస్ కేస్ ఏమైంది? అని నెటిజన్ అడిగితే.. ఇలా సమాధానం ఇచ్చింది. అరెస్టులు మొదలయ్యాయ్ కదండి.. ఇది కొందరి భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా?.. విచారణ జరిపి అరెస్ట్ చేస్తున్నారు.. మెల్లిగా జరుగుతోంది.. కానీ ప్రాసెస్ మాత్రం జరుగుతోంది.. మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది..

బయట ఇలా చేసే వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఎదుటి వాళ్లను కించపర్చడం, అగౌరవపర్చడం తప్పు.. అది చట్టారిత్యా నేరం అనేది కచ్చితంగా అమల్లోకి రావాలి.. తీసుకురావాలి.. చాలా ఓపికతో నచ్చజెప్పడం చేశాను ఇన్నాళ్లు.. ఇప్పుడిక యాక్షనే అంటూ అనసూయ తన సమాధానం ఇచ్చింది.

ఇక అనసూయ చేతిలో ప్రస్తుతం రంగమార్తాండ, హరిహర వీరమల్లు, చేజ్, ఫ్లాష్‌ బ్యాక్, మైఖేల్, సింబా, అరి అనే సినిమాలున్నాయి. పుష్ప పార్ట్ 2 సెట్‌లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోందట. మరో రెండు చిత్రాలు ప్రారంభించబోతోన్నట్టు చెప్పింది. అంతే కాకుండా మోహన్ లాల్ భీష్మ పర్వం తరువాత మరో పెద్ద సినిమాను కూడా స్టార్ట్ చేయబోతోన్నానంటూ చెప్పేసింది.

Also Read : Gruhalakshmi Kasthuri : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు!.. ముస్లింలు చేస్తే నేరం కాదు కానీ.. గృహలక్ష్మీ కస్తూరి

Also Read : Yash Daughter Ayra : రాకీ భాయ్ కూతురి బర్త్ డే.. యశ్ ఫ్యామిలీ పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News