Bhanu singing in Sridevi Drama Company : శ్రీదేవీ డ్రామా కంపెనీ ఈ మధ్య ఫుల్ ట్రెండ్ అవుతోంది. సుధీర్ రాక ముందు ఒకలా ఉన్న షో.. అతను వచ్చాక టాప్ ప్లేసులోకి వెళ్లింది. ఇక సుధీర్ బయటకు వెళ్లాక అతని స్థానంలో రష్మీ వచ్చి షోను నడిపించింది. ఆది, రాం ప్రసాద్లు ఇద్దరూ షోను భుజాన వేసుకున్నారు. వర్ష, నరేష్, ఇమాన్యుయేల్, బుల్లెట్ భాస్కర్, రీతూ ఇలా అందరినీ మల్లెమాల టీం ఈ షో కోసం వాడేస్తోంది. అయితే ఇప్పుడు ఈ షోలో ఓ ఘట్టం మాత్రం దారుణంగా ట్రోలింగ్కు గురవుతోంది.
వారం నుంచి శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో, అందులో భాను పాట పాడిన తీరు, ఆ గొంతుని సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్తో ఆడేసుకుంటున్నారు. గెలుపు తలుపులే అంటూ శ్రీరామచంద్ర ఎంత డెప్త్గా పాడాడో.. మణిశర్మ బాణీ ఎంత హాయిగా ఉంటుందో.. భాను పాడటంతో ఉన్నదంతా పోయిందని, చిరాకు వస్తోందంటూ భాను మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook