Dulquer Salmaan and Rana Daggubati: దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల కాంబోలో మల్టిలింగ్వల్ మల్టీస్టారర్

Dulquer Salmaan and Rana Daggubati Multistarrer: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో తెలుగు, మళయాళం భాషల్లో ఒక మల్టీస్టారర్ మూవీ రానుంది. రానా దగ్గుబాటినే స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ సల్మాన్ మారు ఆలోచించకుండా వెంటనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకి సైన్ చేయడానికి ఇది కూడా మరో కారణంగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Written by - Pavan | Last Updated : Jun 2, 2023, 05:09 PM IST
Dulquer Salmaan and Rana Daggubati: దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల కాంబోలో మల్టిలింగ్వల్ మల్టీస్టారర్

Dulquer Salmaan and Rana Daggubati Multistarrer: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, మళయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబోలో తెలుగు, మళయాళం భాషల్లో ఒక మల్టీస్టారర్ మూవీ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. సీతారామం మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి ఎంతో సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్‌కి రానా దగ్గుబాటి లవ్ స్టోరీ నేపథ్యంతో ఉన్న ఓ కథ గురించి చెప్పడం.. ఆ స్టోరీ లైన్ దుల్కర్ సల్మాన్‌కి బాగా నచ్చి ఓకె చెప్పడం అన్నీ వెను వెంటనే అయిపోయాయి. అన్నింటికి మించి రానా దగ్గుబాటినే స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ సల్మాన్ మారు ఆలోచించకుండా వెంటనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకి సైన్ చేయడానికి ఇది కూడా మరో కారణంగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

జులై 28న దుల్కర్ సల్మాన్ బర్త్ డే కానుండగా.. అదే రోజున దుల్కర్ కి బర్త్ డే కానుకగా రానా దగ్గుబాటి తమ మల్టీస్టారర్ మూవీ గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే.. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు ఏవీ బయటకు రాకుండా ఉండేందుకు రానా దగ్గుబాటి జాగ్రత్త పడుతున్నాడు. ఒక రైట్ టైమ్ చూసి తానే ఆ డీటేల్స్ వెల్లడించాలనేది రానా ఆలోచనట. వ్యక్తిగతంగానూ రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ మధ్య మంచి స్నేహం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ కొలబరేట్ అవుతున్నారంటే.. ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు నిజంగానే ఇది ఎగ్జైటింగ్ న్యూస్ అవుతుంది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోట అనే మళయాళం చిత్రంతో బిజీగా ఉన్నాడు. మే నెలలోనే దుల్కర్ సల్మాన్ ప్రముఖ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరీతో ఒక డైరెక్ట్ తెలుగు సినిమాకు సైన్ చేశాడు. సీతా రామం మూవీతో తెలుగు వారికి మరింత చేరువైన దుల్కర్ సల్మాన్.. తాజాగా వెంకీ అట్లూరి సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌లోనూ తన మార్క్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అనే అనుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Prabhas Project k : ప్రాజెక్ట్ కేతో బాహుబలి రికార్డులు అవుట్.. రానా కామెంట్స్ వైరల్

రానా దగ్గుబాటి ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న పరేషాన్ మూవీతో బిజీగా ఉన్నాడు. మసూధ హారర్ మూవీ తిరువీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. అలాగే రానా దగ్గుబాటి సోదరుడు అభిరాం అహింస మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఇవాళే విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. నిర్మాతగా రానా దగ్గుబాటి, నటుడిగా అభిరామ్ ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సందర్భం ఇది. అయితే, రానా దగ్గుబాటి నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలు విడుదలై ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినప్పటికీ.. నటుడిగా అభిరామ్‌కి మాత్రం ఇదే తొలి సినిమా కావడంతో అభిరామ్ కూడా అన్న రానా దగ్గుబాటి తరహాలో తన నటనతో ఆకట్టుకుంటాడా లేదా అనేది తేలనుంది.

ఇది కూడా చదవండి : Ram Pothineni : 24 రోజుల పాటు రామ్‌ను పిండేసినట్టున్నాడు.. బోయపాటితో అట్లుంటది

ఇది కూడా చదవండి : Rithu Chowdary: అందాలు వడ్డించిన రీతూ చౌదరి.. హాట్ పిక్స్‌తో హీటు పుట్టిస్తోందిగా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News