Tejasswi Prakash-Karan Kundrra: పెళ్లి కాగానే 25 మంది పిల్లలను కంటాం: నాగిని హీరోయిన్

Tejasswi Prakash wants 25 kids. నాగిని సీరియల్ హీరోయిన్ తేజస్వి ప్రకాష్‌కి 25 మంది పిల్లలను కనాలని ఉందని ఆమె ప్రియుడు కరణ్‌ కుంద్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 11:35 AM IST
  • పెళ్లి కాగానే 25 మంది పిల్లలను కంటాం
  • మంచి భర్తగా కంటే కూడా మంచి తండ్రిగా ఉంటా
  • నాగిని హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Tejasswi Prakash-Karan Kundrra: పెళ్లి కాగానే 25 మంది పిల్లలను కంటాం: నాగిని హీరోయిన్

Karan Kundrra says Tejasswi Prakash wants 25 kids: తేజస్వి ప్రకాశ్‌.. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ చూసిన వాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తేజస్వి మన తెలుగు వాళ్లకు కూడా సుపరిచితమే.. నాగిని 6 సీరియల్‌లో హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. కరణ్‌ కుంద్రాతో బిగ్‌బాస్‌ హౌస్‌లో లవ్‌ జర్నీ కొనసాగించిన తేజస్వి.. బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తమ ప్రేమపై కరణ్ ఏమీ చెప్పనప్పటికీ.. భర్త కంటే మంచి తండ్రి అవుతానని అంటున్నాడు. 

ఆకాసా సింగ్, కరణ్‌ కుంద్రాల పాట 'కమ్లే' ఇటీవల విడులై బాగా పాపులర్ అయింది. దాంతో కరణ్‌ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తాజాగా ఆర్‌జే సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ కుంద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్‌ అభిమానులు తేజస్వి ప్రకాష్‌తో ప్రేమ సంగతేంటని ప్రశ్నంచారు. కొందరు అప్‌డేట్ ఇవ్వమని కూడా కోరారు. దాంతో కరణ్‌ స్పందిస్తూ.. తాను మంచి భర్తగా కంటే కూడా మంచి తండ్రిగా ఉండగలనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. 

తాను భర్త కంటే మంచి తండ్రి అవుతానని ఎందుకు అనుకుంటున్నాడో కరణ్ కుంద్రా వివరించాడు. 'నా సోదరికి పిల్లలు ఉన్నప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నా వయసు 12. వాళ్లు ఎక్కువగా మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు చాలా బాగా అనిపించేది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను పిల్లలతో బాగా ఉండగలని గ్రహించాను' అని కరణ్ పేర్కొన్నాడు. తనకు పెళ్లైతే మాత్రం ముందుగా ఓ ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానన్నాడు. ఇక తేజస్వి ప్రకాష్‌కి 25 మంది పిల్లలను కనాలని ఉందని, ఓసారి ఈ విషయం తనకు చెప్పిందని కరణ్ తెలిపాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో పుట్టిన ప్రేమను తేజస్వి ప్రకాశ్‌, కరణ్ కుంద్రాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల తేజస్వి ఇంటికి తన పేరెంట్స్‌ను తీసుకువెళ్లిన కరణ్‌.. నుదుటన కుంకుమతో బయటకు వచ్చాడట. దాంతో వీరికి రోకా అయిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ అసలు విషయం తెలియదు. తేజస్వి ప్రకాశ్‌ ప్రస్తుతం నాగిని 6 సీరియల్‌లో నటిస్తున్నారు. 

Also Read: INDW vs AUSW: మిథాలీ, హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీలు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం! ఓడితే అంతేసంగతులు!!

Also Read: Jhulan Goswami: డబుల్ సెంచరీ కొట్టిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News