Kajol: ఆ మాత్రం తెలీదా..?.. దుర్గాపూజ వేళ రెచ్చిపోయిన బాలీవుడ్ నటి కాజోల్.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

Dussehra Navratri 2024: దేశ మంతట శరన్నవరాత్రి అమ్మవారి పూజలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రస్తుతం దుర్గాపూజలో ఆవేశంతో ఊగిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 11, 2024, 08:22 PM IST
  • దుర్గాపూజలో కోపంతో ఊగిపోయిన నటి కజోల్..
  • పద్దతి మార్చుకొవాలంటూ ఫైర్..
Kajol:  ఆ మాత్రం తెలీదా..?.. దుర్గాపూజ వేళ రెచ్చిపోయిన బాలీవుడ్ నటి కాజోల్.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

kajol angry on those wearing shoes inside durga puja pandal in Mumbai: దేశమంతాట శరన్నవరాత్రి దుర్గపూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తొమ్మిరోజులు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తుల్ని అనుగ్రహిస్తు ఉంటారు.అయితే.. అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. దసరా నేపథ్యంలో కొంత మంది దుర్గామాత విగ్రహాల దగ్గరకు వెళ్లి మరీ పూజలు చేస్తుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోను కొంతమంది దుర్గాపూజలు చేస్తుంటారు. నటి కాజోల్ ముంబైలోకి శాంతా క్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజలో పాల్గొన్నారు. కానీ అక్కడ ఆవేశంతో ఆమె ఊగీపోయారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ముంబైలోని  శాంతాక్రూజ్‌లోని నార్త్ బాంబే సర్బోజనిన్ దుర్గా పూజలో నటి కాజోల్, ఆమె సోదరి తనీషా ముఖర్జీ, నటి అలియా భట్ లు పాల్గొన్నారు. అప్పుడు మండపంలో దుర్గామత ఆలయం వద్ద పూజలు జరుగుతున్నాయి. ఇంతలో.. కాజోల్ ఒక్కసారిగానే ఆవేశంతో ఊగిపోతు అక్కడ కొంత మందిపై ఫైర్ అయ్యారు. అమ్మవారి విగ్రహాం ఉన్న మండపం వద్దకొంత మంది షూస్ లు, చెప్పులు వేసుకుని రావడంను కాజోల్ చూశారు.ఈ ఘటనపై ఆమె సీరియస్ అయ్యారు.

దుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాత్రం తెలీదా అన్నట్లు ఆమె తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మైక్ పట్టుకుని అక్కడున్న వాళ్లకు షూస్  , చెప్పులు ధరించి దయచేసి రావొద్దని కూడా స్పెషల్ గా రిక్వెస్ట్ సైతం చేశారు. సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాజోల్ కూడా బూట్లు ధరించి పండల్‌లోకి ప్రవేశించిన సందర్శకులపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కెమెరాకు చిక్కింది. పవిత్రమైన ఆలయంలో ఇదేం పనులంటూ కూడా ఆమె కోపంతో ఊగిపోయారు.

Read more: Viral Video: ఏంది భయ్యా.. ఈ టాలెంట్.. దాండియా ఆడుకుంటూ బుక్ రీడింగ్.. వీడియో వైరల్..

ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది, నటి కాజోల్ తన భర్త అజయ్ దేవగన్, కొడుకు యుగ్‌తో కలిసి పండల్ వద్ద కనిపించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే గురువారం కూడా ఆమె యుగ్‌తో పాటు భక్తులకు భోగ్ వడ్డిస్తూ కనిపించారు. ప్రతి సంవత్సరం దుర్గాపూజలో పాల్గొంటు ఉంటారు. ఈ ఏడాది కూడా కజోల్ తన ఫ్యామీలీతో కలిసి దుర్గామాత పూజలో పాల్గొన్నారు. అప్పుడు ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Trending News