Puneeth Rajkumar Death News: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Puneeth Rajkumar Death News: కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, హాస్యనటుడు అలీ సందర్శించారు. పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహాన్ని చూస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 06:18 PM IST
Puneeth Rajkumar Death News: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Puneeth Rajkumar Death News: శాండ‌ల్‌వుడ్ న‌టుడు కన్నడ పవర్‌‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Kannada Power Star Puneet Rajkumar) చిన్న వయసులోనే అకాల మరణం చెందడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. వెండితెరపై మాత్రమే కాకుండా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం (Puneeth Raj Kumar Died) చెంద‌డంతో అంద‌రూ శోక‌సంద్రంలో మునిగారు. పునీత్ మృతి ప‌ట్ల శాండ‌ల్‌వుడ్ ప్ర‌ముఖ‌లే కాక టాలీవుడ్‌ (Tollywood‌ News), బాలీవుడ్, కోలీవుడ్ ప్ర‌ముఖులు కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు బెంగళూరు చేరుకున్నారు (Puneeth Rajkumar Death). ఉదయం నుంచి ఎంతో మంది పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. తాజాగా అగ్ర నటులు చిరంజీవి, వెంకటేశ్‌ పునీత్‌ పార్థీవ దేహానికి నివాళుర్పించారు. శనివారం సాయంత్రం కంఠీరవ స్టేడియానికి చేరుకున్న చిరంజీవి, వెంకటేశ్‌ పునీత్‌ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు (Puneeth Rajkumar Death News). అనంతరం అక్కడే ఉన్న శివరాజ్‌కుమార్‌తో మాట్లాడారు. కన్నీటి పర్యంతమవుతున్న ఆయనకు ధైర్యం చెప్పారు. చిరంజీవితో పాటు నటులు శ్రీకాంత్‌, అలీ కూడా పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అమెరికాలో ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కుమార్తె ధ్రుతి బెంగళూరు చేరుకున్నారు. 

“పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన అకాల మరణం కలిచివేస్తోంది. భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. బెంగళూరు వస్తే పునీత్‌ను కలిసేవాడిని. ఇటీవలే ఆయనను కలిశా. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని చిరంజీవి అన్నారు.

ఎలా జరిగింది?

శుక్రవారం (అక్టోబర్​ 29) ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​ రాజ్ కుమార్ కు ఛాతీలో నొప్పి వచ్చింది (Puneeth Rajkumar Died). దీంతో ఆయన్ని వెంటనే ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచారు. ఆదివారం (అక్టోబర్​ 31) అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read: Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ  

Also Read: Puneeth Rajkumars Funeral: పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు వాయిదా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News