DJ Tillu director: సిద్దు జొన్నలగడ్డతో విభేదాలు.. అందుకే టిల్లు స్క్వేర్ చేయడం లేదు.. అసలు విషయం బయట పెట్టిన డీజే డైరెక్టర్!

Vimal Krishna on Dj TIllu Square: తాను డీజే టిల్లు సినిమా సీక్వెల్ కు ఎందుకు డైరెక్టర్ గా లేనని విషయం మీద పెదవి విప్పాడు డైరెక్టర్ విమల్ కృష్ణ. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 9, 2022, 10:51 PM IST
DJ Tillu director: సిద్దు జొన్నలగడ్డతో విభేదాలు.. అందుకే టిల్లు స్క్వేర్ చేయడం లేదు.. అసలు విషయం బయట పెట్టిన డీజే డైరెక్టర్!

DJ Tillu director Vimal Krishna on Dj TIllu Square: ఈ ఏడేది సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాల్లో డీజే టిల్లు కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా విమల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో రూపొంది తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఆ సినిమాలో కామెడీ, పలు ట్విస్టులు, సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ అతని ఆటిట్యూడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి అనేక విషయాల్లో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూసి మెస్మరైజ్ అయ్యారు.

ఈ సినిమాకు దాదాపు నాలుగైదు రెట్లు లాభాలు రావడంతో సీక్వెల్ కూడా చేయాలని అప్పట్లోనే నిర్ణయించుకున్నారు. ఈ నేపద్యంలో డీజే టిల్లు నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ అయింది. అయితే డీజే టిల్లు సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించిన విమల్ ఈ రెండో సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించడం లేదు.

ఈ నేపథ్యంలోనే డీజే టిల్లు సినిమాకి కథ అందించిన సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్ విమల్ మధ్య గొడవలు వచ్చాయని అందుకే అతని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఇలా పలు ప్రచారాలు అయితే జరిగాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ విమల కృష్ణ ఈ అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకి ఒక క్యారెక్టర్ మీద రెండోసారి వర్క్ చేయాలనే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు, అందుకే ఈ సినిమా నుంచి తానే తప్పుకున్నానని ఆయన అన్నారు.

తనకు సిద్ధుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయాలంటే అది కొత్త క్యారెక్టర్ అయితే చేస్తాను తప్ప ఇలా ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ తో మళ్ళీ చేయాలని ఆసక్తి తనకు లేదని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతానికి తను వేరే ప్రాజెక్టులో బిజీగా ఉన్నానని ఇతర ప్రొడక్షన్ హౌసులు అలాగే ఇతర నటీనటులతో తాను బిజీగా ఉన్నారు కాబట్టి సిద్దుతో కలిసి పని చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక డీజే టిల్లు సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో డైరెక్టర్ నే కాదు హీరోయిన్ ని కూడా పక్కన పెట్టినట్లే చెప్పాలి. ఇక మార్చి 2023 వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి. 

Also Read: Ram Charan for Velpari: నక్కతోక తొక్కిన రామ్ చరణ్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీలక పాత్ర?

Also Read: Harihara Veeramallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. ఇక రచ్చ రచ్చే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News