Prabhas Amitabh: కల నిజమైందంటూ ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌!!

Prabhas tweet about Amitabh Bachchan: 'ప్రాజెక్ట్‌ కే' సినిమా రెండో షెడ్యూల్‌ పట్టాలపై ఉంది. ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదే విషయాన్ని యంగ్ రెబల్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 05:24 PM IST
  • కల నిజమైందంటూ ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌
  • ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
  • ప్రాజెక్ట్‌ కే సినిమాలో అమితాబ్‌ కీలక పాత్ర
Prabhas Amitabh: కల నిజమైందంటూ ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌!!

Prabhas tweet about Amitabh Bachchan: 'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు దేశ వ్యాప్తంగా హిట్ కొట్టడంతో ప్రభాస్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. సాహో సినిమా అనంతరం ప్రభాస్‌ వరుస సినిమాలు చేస్తున్నాడు. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో మరోసారి సత్తాచాటడానికి సిద్ధంగా ఉన్నాడు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కే' (రన్నింగ్ టైటిల్) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ప్రాజెక్ట్‌ కేలో భారీ తారాగణం నటిస్తోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌, అమితాబ్‌ మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజా రెండో షెడ్యూల్‌ పట్టాలపై ఉంది. తాజాగా ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదే విషయాన్ని యంగ్ రెబల్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు. 'నా కల నిజమైంది. లెజెండరీ అమితాబ్‌ బచ్చన్ సర్‌తో ఈరోజు 'ప్రాజెక్ట్ కే' మొదటి షాట్‌ను పూర్తి చేశాను' అని అమితాబ్‌ త్రోబాక్ ఫోటోను పోస్ట్ చేశాడు. మొత్తానికి అమితాబ్‌తో నటించాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని ప్రభాస్ చెప్పాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ప్రాజెక్ట్‌ కే సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆదిత్య 369 సినిమాను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాకు మెంటర్‌గా వ్యవహరించడమే ఇందుకు కారణం. తాజాగా  హైదరాబాద్‌లో ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను సైన్స్‌ ఫిక్షన్‌ సెట్స్‌లో చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: 47kg Tumour in Stomach: దేవుడా!! కడుపులో 47 కిలోల కణితి.. 18 ఏళ్లుగా నరకం!

Also Read: UGC NET Result declared: యూజీసీ నెట్ 2021 పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News