Sarkaru Vaari Paata Trailer: నేను విన్నాను.. నేను ఉన్నాను! సర్కారు వారి పాట ట్రైలర్‌లో సీఎం జగన్ డైలాగ్

Sarkaru Vaari Paata movie Trailer released. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో ఈరోజు (మే 2) చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 05:09 PM IST
  • సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్
  • మహేశ్‌ బాబు అభిమానులకు పూనకాలే
  • మే 12న సినిమా విడుదల
Sarkaru Vaari Paata Trailer: నేను విన్నాను.. నేను ఉన్నాను! సర్కారు వారి పాట ట్రైలర్‌లో సీఎం జగన్ డైలాగ్

Mahesh Babu, Keerthy Suresh starrer Sarkaru Vaari Paata movie Trailer out: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. వేసవి కానుకగా సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో ఈరోజు (మే 2) చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలార్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని కూకటపల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించి 105 షార్ట్స్ గల ట్రైలర్ వదిలారు మేకర్స్‌. 2 నిమిషాల 29 సెకండ్ల ట్రైలర్‌లో మహేష్ అదరగొట్టాడు. 'నా ప్రేమ‌ను దొంగిలించ‌గ‌ల‌వు.. నా స్నేహాన్ని దొంగిలించ‌గ‌ల‌వు.. నా డ‌బ్బును దొంగిలించ‌లేవ్' అంటూ సూపర్ స్టార్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొదలవుతుంది. 

'అమ్మాయిల్ని, అప్పు ఇచ్చే వాళ్ల‌ను ప్యాంప‌ర్ చేయాలి రా.. ర‌ఫ్‌గా హ్యాండిల్ చేయ‌కూడ‌దు', 'మీరొక 10 థౌసండ్ డాలర్స్ అప్పిస్తే.. పరీక్ష ఫీ కట్టి టాప్ స్కోర్ చేస్తాను', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'ఈ అమ్మాయిల విషయంలో మీరేంటి సర్ ఇంతలా దిగజారిపోయారు', 'మీరు తప్పితే ఈ భూమ్మీద నాకెవరు లేరు', 'ఏం కిషోర్ మనకేమన్నా మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటావా?', 'ఆయ్ చేసేస్తాడట', 'నా దృష్టిలో అప్పంటే సెటప్ లాంటిది' అనే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

ట్రైలర్‌ చూస్తే.. కీర్తి సురేశ్‌, మ‌హేశ్ బాబును ఫాలో అయ్యే ల‌వ్ ట్రాక్‌ బాగా పండిందని అర్ధమవుతోంది. ఇక వెన్నెల కిశోర్‌, మ‌హేశ్ మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలన్నీ అభిమానుల‌కు ప‌క్కా వినోదాన్ని అందించేలా ఉన్నాయి. దూకుడులో ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్విన విషయం తెలిసిందే. ఇందులో అంతకుమించి ఉండబోతోందట. బ్యాంకింగ్ కుంభ‌కోణాల నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేష్ బాబు చివరగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ హిట్ కొట్టడంతో.. 'సర్కారు వారి పాట'పై అభిమానుల్లో అంతకు మించి అంచనాలు ఏర్పడ్డాయి. 

Also Read: Eid ul Fitr 2022: ఇండియా, పాకిస్తాన్ దేశాల్లో ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ రేపు, ఎలా జరుపుకుంటారంటే..

Also Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన టమోట ధర! కిలో ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News