Konaseema Thugs : మైత్రీ సంస్థ చేతికి 'కోనసీమ థగ్స్'.. రిలీజ్‌కు ముందే భారీ హైప్

Mythri Movie Distributors LLP Releases Konaseema Thugs కోనసీమ థగ్స్ సినిమాను మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. పంపిణీ రంగంలోకి వచ్చిన మైత్రీ ఇప్పుడు కోనసీమ థగ్స్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 03:58 PM IST
  • మైత్రీ చేతికి కోనసీమ థగ్స్
  • పాన్ ఇండియన్ రేంజ్‌లో క్రేజ్
  • ఫిబ్రవరి 24న విడుదల
Konaseema Thugs : మైత్రీ సంస్థ చేతికి 'కోనసీమ థగ్స్'.. రిలీజ్‌కు ముందే భారీ హైప్

Mythri Movie Distributors LLP Releases Konaseema Thugs ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియన్ సినిమాల హవానే నడుస్తోంది. సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అంతా కూడా రా అండ్ రస్టిక్ సినిమాలను ఎంచుకుంటున్నారు. 70, 80వ దశకం అంటూ నాటి కాన్సైప్ట్‌లను ఎంచుకుంటూ ఉన్నారు.

ఇప్పుడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్‌ దర్శకురాలిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆమె డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో థగ్స్ అనే చిత్రం రెడీ అవుతోంది తెలుగులో ఈ సినిమాను కోనసీమ థగ్స్ అనే పేరుతో రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స కోనసీమ థగ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తుండగా.. జియో స్టూడియోస్‌తో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

కోనసీమ థగ్స్ సినిమాలో సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ వంటివారు కీ రోల్స్ పోషించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలను దింపి, వాటిని స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పంపిణీ రంగంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి తన మార్క్ వేసింది. అలాంటి పెద్ద సంస్థ దృష్టిలో కోనసీమ థగ్స్ సినిమా పడింది. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా రూపొందిన కోనసీమ థగ్స్ సంబంధించి ట్రైలర్, పోస్టర్స్, అమ్మన్ సాంగ్ చూసి మైత్రీ వారు ఇంప్రెస్ అయ్యారట. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి ద్వారా రిలీజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే సినిమా మీద మంచి హైప్ ఉండటం, ఇప్పుడు మైత్రి సంస్థ జత కలవడంతో మరింత బజ్ క్రియేట్ అయింది.  ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో ఈ నెల 19న నిర్వహించనున్నారు. ఇక భారీ స్థాయిలో ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News