Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్

Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 12:28 PM IST
Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్

Nagababu -AlluArjun Controversy: మొదటినుంచి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మద్య బేధాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు. మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏమన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబు అల్లు అర్జున్ మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

అసలు విషయానికి వస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో.. టాలీవుడ్ లోని ఎంతోమంది హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలామంది మెగా కాంపౌండ్ హీరోలు పిఠాపురం వెళ్లి మరి ప్రచారం కూడా చేశారు. కొంతమంది ట్విట్టర్ వేదికగా సపోర్టిస్తూ వచ్చారు. ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి తన బెస్ట్ విషెస్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అక్కడి వరకు బాగానే జరిగింది. ఆ తరువాత మాత్రం అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానుల్లో కొంచెం నిరాశ కలిగించింది. ట్విట్టర్ పోస్ట్ వేసిన తర్వాత రోజే అల్లు అర్జున్.. నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సిపి పార్టీ తరుపున నిలిచిన తన స్నేహితుడికి మద్దతు తెలిపారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెస్ చెబుతూ వైసిపి కాండేట్ ను కలవడం అనేది చాలామందికి నచ్చలేదు.

ఈ క్రమంలో నాగబాబు వేసిన ట్వీట్ సెన్సేషనల్ గా మారింది. “మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే” అని నాగబాబు ట్వీట్ ను వేశారు. ఈ ట్వీట్ చదవగానే.. ఈ ట్వీట్ నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి వేశాడని చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిలో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధంగా ఉందే అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు కోసం మద్దతు తెలపడం నచ్చకే.. నాగబాబు ఈ పోస్ట్ వేసి ఉంటారు అని పోస్ట్ చదివితేనే అర్థం అవుతుంది.

కానీ నాగబాబు ఈ ట్వీట్ లో ఎవరి పేరు ప్రస్తావించకపోవడంతో.. ఈ ట్వీట్ ఎవరికోసం పెట్టుంటారు అనేదాని గురించి.. మనం పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేము. కాగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగబాబు ఈ ట్వీట్ అల్లు అర్జున్ నంద్యాల లో క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా చేయచ్చు. కానీ అలా చేస్తే, పవవ్ కళ్యాణ్ కి ఓట్ వేద్దాం అని అనుకునే బన్నీ ఫ్యాన్స్ కొందరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందుకే నిన్న ఎన్నికలు పూర్తవ్వగానే నాగబాబు ఇలా ఘాటుగా ట్వీట్ పెట్టారు అని మరికొందరు చెబుతున్నారు.

 

 

Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News