Chiranjeevi - Padma Awards: పద్మ అవార్డు గ్రహీతలైన చిరంజీవికి, వెంకయ్య నాయుడు గార్లకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభినందనలు..

Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్  చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2024, 03:03 PM IST
Chiranjeevi - Padma Awards: పద్మ అవార్డు గ్రహీతలైన చిరంజీవికి, వెంకయ్య నాయుడు గార్లకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభినందనలు..

Venkaiah Naidu - Chiranjeevi - Pawan Kalyan- Padma Awards: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవికి 2024 యేడాదికి గాను కేంద్రం పద్మ విభూషణ్‌కు ఎంపిక చేయడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసారు. భారత చలన చిత్రసీమలో స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగారు చిరంజీవి.  అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు పవన్. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాబట్టే జన హృదయాలను గెలుచుకున్నారు.టాప్ స్టార్‌గా  తిరుగులేని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి  చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్టు తెలిపారు.

అటు  మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో దక్కిన గౌరవమన్నారు.  విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన  వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైన్నారు. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నట్టు తెలిపారు జనసేనాని.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం పై ఆనందం వ్యక్తం చేసారు. . మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోంలాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News