రజనీ 2.0 మళ్లీ వాయిదా

దీపావళికి బదులు 2018లో రిపబ్లిక్ డే స్పెషల్‌గా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశలో పడ్డారు.

Last Updated : Nov 30, 2017, 06:46 PM IST
రజనీ 2.0 మళ్లీ వాయిదా

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "2.0" చిత్రం తొలుత దీపావళికి విడుదల చేయాలని భావించినా.. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు నిర్మాతలు. దీపావళికి బదులు 2018లో రిపబ్లిక్ డే స్పెషల్‌గా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశలో పడ్డారు. సినిమాకి సంబంధించి సీజీ పనులు ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని పలువురు చెబుతున్నారు.

అయితే తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ నెలలో చిత్రం విడుదల కావచ్చనే అభిప్రాయం పరిశ్రమవర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర భాషల శాటిలైట్ హక్కులను 100 కోట్లకు పైగానే అమ్మారని సమాచారం

Trending News