Ram Charan Fans: ఆర్సీ 15ని వదిలేసిన శంకర్.. టెన్షన్లో చెర్రీ ఫాన్స్!

Ram Charan Fans in tension : శంకర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు, ఆయన వెళ్లి ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో భాగమయ్యి తమ హీరో సినిమాను పట్టించుకోవడం లేదని వారంతా భావిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 06:52 PM IST
Ram Charan Fans: ఆర్సీ 15ని వదిలేసిన శంకర్.. టెన్షన్లో చెర్రీ ఫాన్స్!

Ram Charan Fans in tension Due to Shankar Film: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తేజ్ ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని భావించారు.

కానీ తర్వాత దాన్ని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2024 సంక్రాంతికి దాన్ని వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోవడంతో పంతానికి పోయి శంకర్ రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ ప్రారంభించారు. అంతా బాగానే ఉంది ఇలానే సాగితే ఇక షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది అనుకుంటున్న సమయంలో కమల్ హాసన్ శంకర్ మధ్య లైకా ప్రొడక్షన్స్ సంస్థ సయోధ్య కుదర్చడంతో రామ్ చరణ్ సినిమా పక్కన పెట్టి మరీ శంకర్ తమిళనాడులో వాలిపోయి ఇండియన్ 2 సినిమా షూటింగ్ లు పనిలో పడ్డారు.

దానికి తోడు ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు అనౌన్స్ చేశారు. దాన్ని పక్కనపెట్టి మరి తమిళంలో ఫేమస్ నవల అయిన వేల్పరి అనే నవలలను బాహుబలి రేంజ్ లో తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఇలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ విషయం మీద చాలా టెన్షన్ పడుతున్నారు. రామ్ చరణ్ మూవీకి సంబంధించి ఒకటి రెండు పోస్టర్లు తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదని ఈ సినిమాని వచ్చే ఏడాది అసలు రిలీజ్ చేస్తారా? చేయరా? అనే విషయం మీద వారంతా హైరానా పడుతున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రలకు గాను ఇద్దరు హీరోయిన్లను ఇప్పటికే రంగంలోకి దించారు. ఇక గతంలో రాంచరణ్ సైకిల్ తొక్కుతున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినిమా మీద బజ్ ఏర్పడింది. కానీ దాన్ని క్యాష్ చేసుకునేందుకు మాత్రం సినిమా యూనిట్ కష్టపడడం లేదనే వాదన వినిపిస్తోంది. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది. 
Also Read: Heroines Accidents : మన హీరోయిన్లకు ఏమైంది.. ఒకరికి అరుదైన వ్యాధి మరొకరికి యాక్సిడెంట్.. ఇద్దరికి కాలి ఫ్రాక్చర్!

Also Read: Sania Mirza: విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి? విడాకులపై సానియా కొత్త అనుమానాలు!

Trending News