Saddam Yadamma Raju Back To Jabardasth బుల్లితెరపై జరిగే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు జబర్దస్త్, మల్లెమాల నుంచి బయటకు వెళ్తూనే ఉండేవారు. అనసూయ, సుధీర్, గెటప్ శ్రీను, ఆది ఇలా అందరూ బయటకు వెళ్లారు. మధ్యలో శ్రీను, ఆది ఇలా తిరిగి వచ్చారు. అయితే మల్లెమాల నుంచి వెళ్లడమే గానీ.. ఒక్కరు కూడా బయటి నుంచి లోపలకు రావడం లేదు. దీంతో మల్లెమాల టీం లోలోపల గట్టిగానే ప్రయత్నాలు చేపట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జబర్దస్త్, మల్లెమాలలోకి చాలా మందే వచ్చేట్టు కనిపిస్తోంది,
చమ్మక్ చంద్ర తన గురువు అని, ఆయన బయటకు వెళ్లడంతో తాను కూడా వెళ్లానని ఆ మధ్య జబర్దస్త్ సత్య చెప్పింది. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోలోకి తిరిగి వచ్చింది. ఇక ఆమె దారిలో సద్దాం, యాదమ్మ రాజులు కూడా వచ్చేశారు. సద్దాం, యాదమ్మ రాజులకు లైఫ్ ఇచ్చిందే మల్లెమాల సంస్థ. యాంకర్ రవి, శ్రీముఖి కలిసి చేసిన పటాస్ షోతో సద్దాం, యాదమ్మ రాజులు తెర మీదకు వచ్చారు. ఆ స్టేజ్ మీదే వీరి ప్రయాణం మొదలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook