Tollywood: కొత్త ఏడాదిలో మహేశ్ తీసుకోబోయే నిర్ణయం తెలుసా

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న మహేశ్ బాబు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడని తెలుస్తోంది. అప్ కమింగ్ హీరోల్ని ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నాడట.

Last Updated : Dec 20, 2020, 05:26 PM IST
  • కొత్త ఏడాదిలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు నిర్ణయం
  • అప్ కమింగ్ హీరోలకు అవకాశమిచ్చేందుకు ఆలోచన
  • జాబితాలో అడివి శేష్, రాజ్ తరుణ్, సిద్దూ జొన్నలగడ్డ, సత్యదేవ్ తదితరులు
Tollywood: కొత్త ఏడాదిలో మహేశ్ తీసుకోబోయే నిర్ణయం తెలుసా

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న మహేశ్ బాబు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడని తెలుస్తోంది. అప్ కమింగ్ హీరోల్ని ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నాడట. 

ఒకరికి సహాయం చేస్తే..అది మనకే ఎదురొస్తుంది. చాలామంది నమ్మే సిద్ధాంతమే. ముఖ్యంగా ఒకరికి ప్రోత్సాహమందిస్తే కలిసొచ్చే వ్యక్తిగత లాభం కంటే మానసిక ఆనందం చాలా మెరుగైనదనేది పెద్దలు చెప్పే మాట. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Superstar Mahesh babu ) సరికొత్త ఆలోచనతో ముందుకుపోతున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమ ( Telugu cinema Industry ) లో కొత్త తరానికి అవకాశం అందించేందుకు నిర్ణయించుకున్న మహేశ్..ఆ దిశగా ముందుకు పోతున్నాడు. రానున్న రోజుల్లో వీలైనంత వరకూ అప్ కమింగ్ హీరోలకు సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు ప్రిన్స్ మహేశ్. 

ప్రస్తుతం అడివి శేషుతో మేజర్ సినిమా తీస్తున్నాడు మహేశ్. మేజర్ ఉన్ని కృష్ణన్ ( Major Unni krishnan ) జీవిత కధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చేవారం మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టటితో విభిన్నమైన సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. మహేశ్ అనుకున్న అప్ కమింగ్ హీరోలో జాబితాలో రాజ్ తరుణ్, సత్యదేవ్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలున్నారు. ఎటువంటి అండదండలు లేని హీరోలకే మహేశ్ అవకాశాలివ్వాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. మరి మిగిలిన హీరోలు కూడా ఇదే బాట పడితే..అప్ కమింగ్ యంగ్ టాలెంట్ బయటకు వస్తుంది. 

Also read: Bigg Boss 4 Telugu Winner: హిస్టరీ రిపీట్ కానుందా.. అద్భుతం జరగనుందా!

Trending News