Naga shaurya: దర్శన్ కు మద్దతు గా టాలీవుడ్ హీరో... బాధేస్తోంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

Naga shaurya.. దర్శన్ హత్య కేసులో నాగశౌర్య మాట్లాడుతూ.. దర్శన్ హత్య చేసే అంత క్రూరడు కాదు.. ఆయన చాలా మంచి వ్యక్తి.. న్యాయ వ్యవస్థ పై నమ్మకముందు.. త్వరలోనే నిజాలు తెలుస్తాయని తెలిపాడు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 28, 2024, 09:30 AM IST
Naga shaurya: దర్శన్ కు మద్దతు గా టాలీవుడ్ హీరో... బాధేస్తోంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

Naga shaurya..  అభిమాని రేణుక స్వామి (28) హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ప్రముఖ సీరియల్ నటి , తన ప్రేయసి పవిత్ర గౌడ కోసం ఈయన ఏకంగా హత్య చేయించారనే వార్తలు తెరపైన తెగ హల్చల్ చేస్తున్నాయి. హత్య కేసులో ఏ 2 నిందితుడుగా హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో పలువురు సెలబ్రిటీలు దర్శన్ కి అండగా నిలుస్తుంటే.. మరి కొంతమంది దర్శన్ పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కస్తూరి శంకర్ , ప్రముఖ హీరో ఉపేంద్ర లాంటి నటులు దర్శన్ చాలా మంచి వ్యక్తి అని.. ఒక మనిషిని హత్య చేసే అంత క్రూరుడైతే కాదు అని.. వారు మీడియా ముఖంగా తెలిపిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు తాజాగా ఈయనకు అండగా మరో టాలీవుడ్ హీరో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎవరో కాదు ప్రామిసింగ్ హీరో నాగశౌర్య... ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించి.. భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగశౌర్య తాజాగా దర్శన్ హత్య కేసు పై స్పందించారు.. "దర్శన్ నాకు అన్న లాంటి వ్యక్తి.. రేణుక స్వామి మృతి పై విచారం వ్యక్తం చేస్తున్నాను.. కానీ దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదు.. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో దర్శన్ ను  దోషిగా నిర్ధారిస్తుంటే చాలా బాధ వేస్తోంది. ఆయన కలలో కూడా చీమకు కూడా హాని కలిగించని వ్యక్తి.. అలాంటి వ్యక్తిని అందరూ దోషీ అని నిర్ధారిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. న్యాయవ్యవస్థ పై నాకు నమ్మకం ఉంది త్వరలోనే నిజం బయటకు వస్తుంది"  అంటూ.. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టా లో పోస్ట్ చేశారు యంగ్ హీరో నాగ శౌర్య..

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Shaurya (@actorshaurya)

అసలు విషయంలోకి వెళ్తే.. హీరో దర్శన్ భార్య,  పిల్లలు ఉండగానే..  ప్రముఖ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.. దీంతో దర్శన్ వీరాభిమాని పవిత్ర గౌడ ను టార్గెట్ చేస్తూ దూషిస్తూ సోషల్ మీడియా ఖాతాలో  నెగిటివ్ కామెంట్లు చేశారు..  దీంతో తట్టుకోలేకపోయిన ఈమె దర్శన్ ను ఒప్పించి రూ .30 లక్షలు సఫారీ ఇచ్చి రేణుక స్వామిని హత్య చేశారు. ఈ హత్య కేసుతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. దీంతో దర్శన్ దోషి అంటూ పోలీసులు అరెస్టు చేశారు.

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News