మాటే మంత్రము 1 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: వసుంధర, వంశీల మధ్య పెరిగిన బంధం

ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్

Last Updated : Aug 3, 2018, 12:05 PM IST
మాటే మంత్రము 1 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: వసుంధర, వంశీల మధ్య పెరిగిన బంధం

మీ అభిమాన జీ తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్ తాజా ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే... రేవ్ పార్టీ వల్ల ఓ గదిలో చిక్కుకుపోయిన వంశీ, వసుంధరలు అటు బయటకు వెళ్లలేక, ఇటు అదే గదిలో గంటల తరబడి ఉండలేక ఏమీ చేయలేని పరిస్ధితుల్లో వుంటారు. అయితే వసుంధర మీద తనకున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు వంశీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వుంటాడు. యండమూరి నవలను కలిపి చదువుతుంటారు. వసుంధరతో నవల చదివిస్తాడు వంశీ. 

అక్కడ కాంతం ఇంట్లో వసుంధర మీద అవాకులు చెవాకులు పేలుతున్న జోగిమీద అరుస్తుంది తులసి. వసుంధర నిప్పు అని ఆమె గురించి చెత్తగా మాట్లాడొద్దని తులసి జోగిని వారిస్తుంది. అయినా అతను వినిపించుకోకుండా ఏదో ఒకటి అంటూనే ఉండటం భరించలేని తులసి అతన్ని వెళ్లమనేసరికి కాంతం తులసి మీద ఆగ్రహం వ్యక్తంచేస్తుంది.

 

అక్కడ గదిలో వున్న వంశీ, వసుంధరలు చిక్కుల్లో పడతారు. పోలీసులు రైడింగ్‌కు వస్తారు. ఎంతగా ప్రయత్నించినా తప్పించుకోలేని పరిస్ధితి. ఎస్ఐ తలుపులు బద్దలు కొడతాడు. వసుంధర, వంశీలను అరెస్ట్ చేస్తా అంటాడు. భార్యాభర్తలని ఎలా అరెస్ట్ చేస్తావ్ అంటూ వంశీ అప్పటికప్పపుడు పసుపు కొమ్మును వసుంధర మెడలో కడతాడు. వసుంధర షాక్ అవుతుంది. ఆ తర్వాత మాటే మంత్రము సీరియల్ ఏ మలుపు తిరింగదనేది సీరియల్ చూస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Trending News