తెలుగు కష్టమర్స్‌కు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ తన డేటా ప్లాన్‌లో మార్పులు చేసింది

Last Updated : Feb 21, 2018, 02:05 PM IST
తెలుగు కష్టమర్స్‌కు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

మార్కెట్లో రిలయన్స్ జియో పోటీ తట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్న ఎయిర్ టెల్ ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.98 డేటా ప్లాన్ లో మార్పులు చేసింది. రూ.98 రీఛార్జ్ పై 5 జీబీ (4జీ/3 జీ ) డేటా 28 రోజల వరకు పొందవచ్చని పేర్కొంది. అయితే ఈ 5 జీబీ డేటా డైలీ కెపాసిటీతో సంబంధం లేకుండా 28 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపింది. గతంలో ఇదే డేటా ప్యాక్ లో 2 జీబీ డేటా మాత్రమే ఉండేది..తాజా మార్పులతో అదనంగా మరో 3 జీబీ డేటా అందుతోంది. కాగా ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్ టెల్ పేర్కొంది. మిగిలిన రాష్ట్రాల్లో  మాత్రం ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవు. అంటే వారు 2 జీబీ డేటా మాత్రమే పొందుతారు

Trending News