ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నటి సాయి పల్లవి

చెన్నై:  అటు తెలుగు, ఇటు తమిళ్ లో మెరుస్తున్న అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకుల మదిని  కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది. 

Last Updated : Feb 8, 2020, 06:17 PM IST
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నటి సాయి పల్లవి

చెన్నై:  అటు తెలుగు, ఇటు తమిళ్ లో మెరుస్తున్న అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకుల మదిని  కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది. ముప్పై ఏళ్లలోపు వయసున్న వారు తమ తమ రంగాల్లో సాధించిన విజయాలకు గాను ఈ ఘనత దక్కుతుంది. 

మొత్తం ముప్పై మందికి ఈ జాబితాలో చోటును ఫోర్బ్స్ సంస్థ కల్పించింది. కాగా, సాయి పల్లవికి తన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఆమెకు 27వ స్థానం దక్కింది. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో  సాయి పల్లవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రతిభావంతులైన 255 మంది పోటీదారులలో నటి సాయి పల్లవి టాప్ 30 జాబితాలో నిలిచారు. 

ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీలో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంతో  అభివృద్ధి చెందుతోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యే దశలో ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. అంతే కాకుండా రానా దగ్గుబాటి నటించిన విరాటా పర్వంలో కూడా సాయి పల్లవి నటిస్తోంది. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News