దుమ్మురేపుతున్న 'ఎయ్ పిల్లా' సాంగ్. .

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలోని 'ఎయ్ పిల్లా' పాట దుమ్మురేపుతోంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది. 

Last Updated : Feb 17, 2020, 10:27 AM IST
దుమ్మురేపుతున్న 'ఎయ్ పిల్లా' సాంగ్. .

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలోని 'ఎయ్ పిల్లా' పాట దుమ్మురేపుతోంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది.  

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని పాటకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. అవును. . కేవలం నాలుగు రోజుల్లోనే 'ఎయ్ పిల్లా' పాటను 4 మిలియన్ల వ్యూస్ దాటి పోయింది. అంటే ఈ పాట ఎంత బాగుందో తెలుస్తోంది. మ్యూజికల్ ప్రివ్యూగా ఈ పాటను కేవలం నిముషం మాత్రమే రిలీజ్ చేశారు. కానీ దీనికి నెటిజనుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. 

పాటతోనే ఈ సినిమాకు కాస్త హైప్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన ఫిదా చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సాయి పల్లవి, నాగచైతన్య ముద్దు సన్నివేశం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పాట మంచి వ్యూస్ సొంతం చేసుకోవడంపై  అక్కినేని నాగచైతన్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 

Trending News