అభిమానులకు క్షమాపణ చెప్పిన షారుఖ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తన ఐపీఎల్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ముంబయి ఇండియన్స్ పై తన టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన క్రమంలో ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. తమ ఆటగాళ్లు స్ఫూర్తిదాయకంగా ఆడనందుకు తాను "సారీ" చెబుతున్నానని ఆయన అన్నారు.

Last Updated : May 10, 2018, 04:36 PM IST
అభిమానులకు క్షమాపణ చెప్పిన షారుఖ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తన ఐపీఎల్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ముంబయి ఇండియన్స్ పై తన టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన క్రమంలో ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. తమ ఆటగాళ్లు స్ఫూర్తిదాయకంగా ఆడనందుకు తాను "సారీ" చెబుతున్నానని ఆయన అన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ అధినేతైన షారుఖ్‌తో పాటు నటి జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా కూడా అదే జట్టులో భాగస్వాములుగా ఉన్నారు.

"క్రీడలు అనేవి స్ఫూర్తిని నింపాలి. గెలుపు ఓటములతో వాటికి సంబంధం లేదు. కానీ ఈ రోజు జట్టు యజమానిగా అదే స్ఫూర్తిని నా ఆటగాళ్లు కనబరచనందుకు అభిమానులకు నేను క్షమాపణలు చెబుతున్నాను" అని ట్వీట్ చేశారు షారుఖ్. బుధవారం ముంబయి ఇండియన్స్ జట్టు నైట్ రైడర్స్‌ని 102 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై చేతిలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పరాజయం పాలైంది. 

తన జట్టు వరుసగా ఓటమిపాలవ్వడంతో షారుక్‌ఖాన్‌ నిజంగానే కోపంతో ఉన్నారు. అందుకే ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని చూపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే షారుఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జీరో" చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. ఇదే సినిమాలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు

Trending News