భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయిన సినీ హీరో..!

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయారు. ఇటీవలే తన చిత్రం "బాఘి 2" ప్రమోషన్ నిమిత్తం ఓ కార్యక్రమానికి తన సినిమా హీరోయిన్ దిశా పటానీతో సహా హాజరైన టైగర్ ష్రాఫ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలారు.

Last Updated : Apr 2, 2018, 08:24 AM IST
భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయిన సినీ హీరో..!

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ భారత రాష్ట్రపతి పేరు చెప్పలేకపోయారు. ఇటీవలే తన చిత్రం "బాఘి 2" ప్రమోషన్ నిమిత్తం ఓ కార్యక్రమానికి తన సినిమా హీరోయిన్ దిశా పటానీతో సహా హాజరైన టైగర్ ష్రాఫ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలారు. "మన భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు" అని యాంకర్ అడిగిన ప్రశ్నను చాలా కష్టమైన ప్రశ్నగా అభివర్ణించిన టైగర్ ష్రాఫ్ .. కొంచెం సేపు ఆగి "ముఖర్జీ అనుకుంటాను" అని సమాధానమిచ్చారు.

ఆయన తప్పుగా సమాధానం చెప్పడంతో యాంకర్ నవ్వి, అదే ప్రశ్నను హీరోయిన్ దిశా పటానీని అడగగా ఆమె సరైన సమాధానం చెప్పింది. "మన దేశ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్" అని పేర్కొంది. గతంలో ఇలాంటి అనుభవమే సినీ హీరోయిన్ అలియా భట్‌కి ఎదురైంది. ఓ ఛాట్ షోలో పాల్గొన్న ఆమెను రాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్న అడగ్గా ఆమె "పృథ్వీరాజ్‌ చౌహాన్‌" అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పింది. 

ఇప్పుడు తాజాగా అలియా భట్ చేసిన పొరపాటే టైగర్ ష్రాఫ్ కూడా చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2014లో హీరోపంటీ చిత్రంతో టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ తెరకు హీరోగా పరిచయమయ్యారు. అల్లు అర్జున్ నటించిన "పరుగు" 'సినిమాకి రీమేక్ ఆ చిత్రం. ఆ తర్వాత బాఘి, ఏ ఫ్లయింగ్ జాట్, మున్నా మైఖేల్, వెల్కమ్ టు న్యూయార్క్ లాంటి చిత్రాల్లో నటించారు టైగర్ ష్రాఫ్.

ఆయన నటించిన తాజా చిత్రం "బాఘి 2" విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే 25 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నారు. పునీత్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Trending News