లైవ్ లో గొడవపడ్డ న్యూస్ రీడర్లు.. వీడియో వైరల్

లైవ్ లో వార్తలు చ‌దివేట‌ప్పుడు న్యూస్ రీడ‌ర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. 

Last Updated : Feb 27, 2018, 09:10 AM IST
లైవ్ లో గొడవపడ్డ న్యూస్ రీడర్లు.. వీడియో వైరల్

లైవ్ లో వార్తలు చ‌దివేట‌ప్పుడు న్యూస్ రీడ‌ర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫీలింగ్స్ లను కంట్రోల్ చేసుకుని వార్తలు చ‌దువుతారు. కానీ, పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు న్యూస్ రీడర్లు మాత్రం గొడవకు దిగారు. పాకిస్తాన్ లోని ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ఛానల్ కు చెందిన ఇద్దరు న్యూస్ రీడ‌ర్లు బ్రేక్ స‌మ‌యంలో గొడ‌వ‌ప‌డ్డారు. మేల్ న్యూస్ రీడ‌ర్, ఫిమేల్ న్యూస్ రీడ‌ర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే లైవ్ వ‌చ్చేముందే న్యూస్ రీడ‌ర్లు, యాంక‌ర్లు జాగ్రత్త పడతారు. కానీ వీరిద్దరూ మాత్రం బ్రేక్ అయిపోయి లైవ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా గొడ‌వ‌ను కంటిన్యూచేశారు. ఇలాంటి యాంక‌ర్ తో నేను ఎలా బులెటిన్ కొన‌సాగించాలి అని మేల్ యాంక‌ర్ అన‌గా.. మాట‌లు స‌రిగ్గా రానీయ్ అని ఫిమేల్ యాంక‌ర్ గుస్సా అయ్యింది. దాదాపు అర నిమిషం పాటు సాగిన ఈ సంభాష‌ణ‌ను ప్రేక్షకులు లైవ్ లో చూసి ఆశ్చర్యపోయారు. న్యూస్ ఛానల్ కు చెందిన ఓ సిబ్బంది ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ఉంచ‌డంతో ఇది వైర‌ల్ గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి..

Trending News