ఢిల్లీలో పొగమంచు; 45 రైళ్లు ఆలస్యం

పొగమంచు కారణంగా ఢిల్లీకి చేరుకోవలసిన 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4రైళ్లు రద్దు, 3 రైలు వేళల్లో మార్పులు

Last Updated : Nov 27, 2017, 10:07 AM IST
ఢిల్లీలో పొగమంచు; 45 రైళ్లు ఆలస్యం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో ఢిల్లీకి చేరుకోవలసిన 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కమ్మేసిన నేపథ్యంలో రైల్వే అధికారులు నాలుగు రైళ్లను రద్దు చేశారు. మూడు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఢిల్లీలో గతకొన్ని రోజులుగా పొగమంచు కమ్మేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ! పొగమంచుతో పాటు ఢిల్లీలో చలి తీవ్రత అధికంగానే ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తగ్గిపోయాయి. గరిష్టం 26 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండగా.. కనిష్టం 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది.  

Trending News