అమితాబ్ మనవరాలు దేశ 'ప్రధాని' అవుతుందట!

ఐశ్వర్య కూతురు దేశ 'ప్రధాని' అవుతుందట!

Last Updated : Jun 25, 2018, 12:33 PM IST
అమితాబ్ మనవరాలు దేశ 'ప్రధాని' అవుతుందట!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు ఆస‌క్తిక‌ర విషయాలను వెల్లడించారు. గతంలో ఈయన మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు.

భార‌త రాజకీయాల్లో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉంద‌ని, దేశానికి ప్రధాని కూడా అవుతారని జ్ఞానేశ్వర్ చెప్పారు. అయితే ఆమె దేశానికి ప్రధాని కావాలంటే.. ఆమె త‌న పేరును రోహిణీగా మార్చుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. 2019 ఎన్నిక‌ల్లో మళ్లీ నరేంద్ర మోదీ గెలుస్తారని, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికవుతారని, రజినీకాంత్ తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఇక‌, 2024లో భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని, రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి 2019లో జ‌రుగుతుంద‌ని కూడా ఆయన జోస్యం చెప్పారు.

Trending News