మోదీ అధికారంలోకి రాకుండా విదేశాల నుంచి నిధుల వరద: రాందేవ్

మోదీ అధికారంలోకి రాకుండా విదేశాల నుంచి నిధుల వరద: రాందేవ్

Last Updated : Apr 17, 2019, 06:57 PM IST
మోదీ అధికారంలోకి రాకుండా విదేశాల నుంచి నిధుల వరద: రాందేవ్

జోధ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశం లోపల, వెలుపల ఎన్నో శక్తులు కుట్రపన్నుతున్నాయని ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీ వ్యతిరేక శక్తులైన క్రిస్టియన్, ఇస్లామిక్ సంస్థలు మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చుచేస్తున్నాయని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Trending News