Ayodhya: 5 లక్షల 51 వేల దీపాలతో వైభవోపేతంగా అయోధ్యలో తొలి దీపావళి

దీపావళి పర్వదినానికి అయోధ్య ముస్తాబవుతోంది. ఒకటి కాదు..రెండు  కాదు...వంద కాదు. 2 వేలు కాదు. ఏకంగా 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందంగా అలంకృతం కానుంది. దీపావళి శోభను మరింతగా పెంచనుంది.

Last Updated : Nov 13, 2020, 06:40 PM IST
Ayodhya: 5 లక్షల 51 వేల దీపాలతో వైభవోపేతంగా  అయోధ్యలో తొలి దీపావళి

దీపావళి పర్వదినానికి అయోధ్య ముస్తాబవుతోంది. ఒకటి కాదు..రెండు  కాదు...వంద కాదు. 2 వేలు కాదు. ఏకంగా 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందంగా అలంకృతం కానుంది. దీపావళి శోభను మరింతగా పెంచనుంది.

హిందూవుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. ఏళ్ల తరబడి పరిష్కారం  కాకుండా ఉన్న వివాదం అయోధ్య రామజన్మభూమి వివాదం ( Ram janmabhoomi dispute ) . దశాబ్దాల తరబడి అపరిష్కృత సమస్యగా ఉన్న అయోధ్య శ్రీ రామజన్మభూమి వివాదానికి తెరపడింది. రామజన్మభూమి ప్రాంతంలో రాముడి భవ్యమందిరానికి భూమిపూజ కూడా ముగిసింది. వివాదం ముగిసి..రాముడి పవిత్ర ఆలయానికి భూమిపూజ జరిగిన తరువాత అయోధ్యలో ఇది తొలి దీపావళి.

అందుకే అయోధ్య ( Ayodhya ) ను మరింత అందంగా...వైభవోపేతంగా..భక్తిమయంగా మార్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీపావళి ( Diwali ) ని పురస్కరించుకుని అయోధ్యలో ఏకంగా 5 లక్షల 51 వేల ప్రమిదల్ని( 5.51 lakhs lamps ) వెలిగించనున్నారు. 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందాన్ని పెంచనున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య తొలి దీపావళిని చూసేందుకు భక్తులు తరలిరానున్నారు. రాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 11 రధాల్ని రామజన్మభూమి ట్రస్ట్ ( Ram janmabhoomi trust ) సిద్ధం చేసింది. ఈ ప్రదర్శన సాకేత్ మహా విద్యాలయం నుంచి ప్రారంభం కానుంది. దీపావళి నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ( Up Cm Yogi Adityanath ) అయోధ్య చేరుకోనున్నారు. రామ్ లల్లా  ( Ramlalla )  దర్శనం చేసుకుని..5 లక్షలకు పైగా దీపాల్ని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Also read: Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

 

 

Trending News