భారీ ఎన్ కౌంటర్, 14 మంది నక్సల్స్ మృతి

Last Updated : Apr 23, 2018, 04:15 PM IST
భారీ ఎన్ కౌంటర్, 14 మంది నక్సల్స్ మృతి

నక్సల్స్ కు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం సీఆర్పీఎఫ్‌ నిర్వహించిన నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో 14 మాయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీప్రాంతంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడు శీను, పేరిమిల్లి దళం కమాండర్ సాయినాథ్ ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దాడిలో పలువురు మావోయిస్టులు గాయాలపాలైనట్లు తెలిసింది. 

శనివారం ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ ను నక్సల్స్ కాల్చి చంపిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా ఈ ఆపరేషన్ లో  సీఆర్పీఎఫ్‌ తో పాటు కోబ్రా బలగాలు భాగస్వాములై నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x