పీడీపీ, కాంగ్రెస్ కలయిక ఉగ్రవాదులకు మాత్రమే మేలు చేస్తుంది - సుబ్రమణ్యస్వామి

                               

Last Updated : Jul 3, 2018, 08:53 PM IST
పీడీపీ, కాంగ్రెస్ కలయిక ఉగ్రవాదులకు మాత్రమే మేలు చేస్తుంది - సుబ్రమణ్యస్వామి

కాంగ్రెస్, పీడీపీలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, పీడీపీ పార్టీలు ఉగ్రవాదులకు అనుకూల పార్టీలని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఏకమైతే కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని..అచారక పాలన సాగుతుందని విమర్శించారు.  పీడీపీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది  కశ్మీర్ కు చేటును కలిగిస్తుందన్నారు. 

ఇటీవలే పీడీపీ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపీడీకి మోజార్టీ సీట్లు లేని కారణంగా అక్కడ పభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని పీడీపీ యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్  కూడా పీడీపీతో పొత్తుకు సై అనేలా కనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x