ఎక్స్‌ప్రెస్ రైలు పవర్ కార్ బోగిలో మంటలు

ఎక్స్‌ప్రెస్ రైలు పవర్ కార్ బోగిలో మంటలు

Last Updated : Sep 6, 2019, 02:57 PM IST
ఎక్స్‌ప్రెస్ రైలు పవర్ కార్ బోగిలో మంటలు

న్యూఢిల్లీ: చండీఘడ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ రైలు పవర్ కార్ బోగిలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 8వ నెంబర్ ప్లాట్‌ఫారంపై రైలు ఆగి ఉండగా.. రైలు చివర్లోని పవర్ కార్ బోగీలో మంటలు అంటుకున్నాయి. పవర్ కార్ బోగీలో మంటలు అంటుకోవడం గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే రైలులోని ప్రయాణికులను హుటాహుటిన రైలులోంచి సురక్షితంగా కిందికి దించేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ నాలుగు అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకుని మంటలు ఇతర కంపార్ట్‌మెంట్స్‌కి వ్యాపించకుండా మంటల్ని ఆర్పేసింది.

షార్క్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News