దేశంలో 8వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రతిరోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతుండగా, దాదాపు పదివేల మంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

Last Updated : Jun 11, 2020, 11:17 AM IST
దేశంలో 8వేలు దాటిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (CoronaVirus) కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,579కి చేరింది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయి. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 8,102 మంది మరణించారు. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల (India Corona Cases)లో 1,41,029 మంది ప్రాణాంతక కోవిడ్19 (COVID19) మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లగా, ప్రస్తుతం 1,37, 448 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భార్యకు కరోనా పాజిటివ్.. భయంతో భర్త మృతి

అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 94,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు, కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తమిళనాడు 36,841, ఢిల్లీ 32,810 కరోనా కేసులతో మహారాష్ట్ర తర్వాత కోవిడ్19(COVID-19) మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News