దుబాయ్ సూపర్ సిరీస్ లో పోరాడి ఓడిన పీవీ సింధూ

దుబాయ్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ  సూపర్ సిరీస్ మహిళా సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధూ పోరాడి ఓడింది.

Last Updated : Dec 19, 2017, 11:42 AM IST
దుబాయ్ సూపర్ సిరీస్ లో పోరాడి ఓడిన పీవీ సింధూ

దుబాయ్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ మహిళా సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధూ పోరాడి ఓడింది. జపాన్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి అకానె యమగుచితో జరిగిన ఫైనల్లో పీవీ సింధు ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇద్దరూ నువ్వా నేనా అన్న విధంగా ఆడారు. 

తొలి మ్యాచ్ లో 21-15తో యమగుచిపై పీవీ సింధూ ఆధిక్యం కనబరిచారు. రెండో మ్యాచ్ లో 12-21తో యమగుచి ఆధిక్యం కనబరిచింది. ఇద్దరూ రెండు మ్యాచుల్లో చెరో ఒక్కొకటి గెలుపొందడంతో మూడో మ్యాచ్ పైనే అందరి దృష్టి. ఇద్దరూ 19-19 వరకు హోరాహోరీగా తలపడ్డారు. కానీ చివరి క్షణంలో యమగుంచి ఒత్తిడిని జయిస్తూ రెండు పాయింట్లు సాధించి విజయం సాధించింది. దీంతో పీవీ సింధూ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x